

విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన మైనర్ బాలుడు, బాలిక కే.కోటపాడులో గురువారం మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు వారి సంబంధాన్ని అంగీకరించకపోవడంతో గతంలో పలుమార్లు ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెందుర్తి పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, మేజర్లు అయిన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మేజర్లు అయిన తర్వాత వివాహం గురించి ఆలోచించవచ్చని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ, ఇటీవల ఇద్దరూ మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యువకుడి అమ్మమ్మ నివసించే కే.కోటపాడు ప్రాంతానికి చేరుకున్నారు. పైడమ్మ చెరువు సమీపంలోని ఓ బావి వద్ద ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కే.కోటపాడు ఎస్ఐ ధనుంజయ వెల్లడించారు. యువకుడు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, యువతి మొదటి సంవత్సరం చదివి మధ్యలోనే విద్యను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!