

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, పర్యాటక రంగ భాగస్వాములతో మంత్రి భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు, భాగస్వాములను ఆయన కోరనున్నారు.
ఐఏటీవో సమావేశంలో గోదావరి పుష్కరాలు 2027 లోగోతో పాటు రోడ్మ్యాప్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించనున్నారు. పుష్కరాల కోసం ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించి, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రచారం చేయాలని టూర్ ఆపరేటర్లకు పిలుపునివ్వనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో గోదావరి పుష్కరాలకు ప్రపంచస్థాయి ప్రచారం కల్పించేందుకు ఏపీ టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ నేతృత్వంలో చర్యలు చేపట్టనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!