

తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మొత్తం 62 అజెండా అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం, కాంట్రాక్టు కార్మికులకు క్వాలిటీ కాస్ట్ బేస్డ్ విధానంలో వేతనాల చెల్లింపు వంటి అంశాలపై మండలి చర్చించింది.
కుమార ధార, పసుపు ధార మధ్య డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణం, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి నిధుల కేటాయింపు, విజిలెన్స్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకం వంటి ప్రతిపాదనలు కూడా సమావేశంలో పరిశీలించారు. ఎస్వీ మ్యూజియంలో రూ.50 ప్రవేశ రుసుముపై నిర్ణయం, టీబీసీ, ఏటీసీలో శిథిలావస్థకు చేరిన 10 కాటేజీల తొలగింపు, వేదపారాయణదారుల నియామకంలో తెలుగువారికి ప్రాధాన్యత, ఎస్వీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారుల రెమ్యునరేషన్ పెంపు వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!