
సినిమాలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 9:45 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్న సీఎం, తెలంగాణలో రహదారుల అభివృద్ధి, ట్రిపుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్) నిర్మాణ పనులపై చర్చించనున్నారు.
అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం కానున్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల పెండింగ్ పనులు, రాష్ట్రంలో విమానయాన మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరుతూ సీఎం ఈ భేటీలు నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!