

టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంను ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గత రెండు రోజులుగా లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సోదాల సందర్భంగా కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించారు. సమాచారం ప్రకారం, తనిఖీల్లో సుమారు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించినట్లు అధికారులు ఆరా తీస్తున్నారు.
సోదాలు పూర్తైన అనంతరం లోకనాథంను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కార్యాలయానికి తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాల ఆధారంగా అధికారులు మరిన్ని అంశాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!