

భారత ఈ-కామర్స్ రంగం రానున్న సంవత్సరాల్లో భారీగా విస్తరించే అవకాశం ఉందని ఇన్ఫిసమ్ నివేదిక అంచనా వేసింది. 2024లో 12,500 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి 34,500 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది. క్విక్ కామర్స్ వేగవంతమైన విస్తరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక తెలిపింది.
దేశంలో డార్క్ స్టోర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది. 2025లో 2,525గా ఉన్న డార్క్ స్టోర్లు 2030 నాటికి దాదాపు 7,500కు చేరుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. వేగవంతమైన డెలివరీలకు పెరుగుతున్న డిమాండ్ దీనికి ప్రధాన కారణమని తెలిపింది. ఈ-కామర్స్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా క్విక్ కామర్స్ కొనసాగుతోందని పేర్కొంది.
2030 నాటికి క్విక్ కామర్స్ మార్కెట్ విలువ 6,500-7,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలో ఈ-రిటైల్ రంగంలో నమోదయ్యే అదనపు వృద్ధిలో 45-50 శాతం వరకు క్విక్ కామర్స్ నుంచే రావచ్చని తెలిపింది. ఈ వృద్ధికి జెన్ జీ కీలక చోదక శక్తిగా మారనుందని, ఇప్పటికే ఆన్లైన్ కొనుగోలుదారుల్లో దాదాపు మూడింట ఒక వంతు జెన్ జీ వినియోగదారులేనని నివేదిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!