

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఏపీ అధికారులు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించగా తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీకి కుడి కాలువ ద్వారా 2,000 క్యూసెక్కులు, తెలంగాణ ఎడమ కాలువ ద్వారా 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం.
దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదలపై రెండు రాష్ట్రాల మధ్య మరోసారి పంచాయితీ మొదలైంది. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కేఆర్ఎంబీ సమావేశంలోనూ రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేఆర్ఎంబీ సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!