

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాల పరిస్థితులను సమీక్షించేందుకు ముంబై మేయర్ రీతూ తావ్డే బుధవారం ఉదయం దాదార్, హింద్మాతా, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో మాట్లాడుతున్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వర్షపు నీటితో పూర్తిగా కప్పబడి ఉన్న ఓ తెరిచి ఉన్న మ్యాన్హోల్ను గుర్తించలేక ఓ పారిశుద్ధ్య కార్మికుడు అందులో పడిపోయాడు.
మేయర్ వెంట ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి కార్మికుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతడిని బీఎంసీకి చెందిన పారిశుద్ధ్య కార్మికుడిగా గుర్తించారు. ఈ ఘటనపై మేయర్ రీతూ తావ్డే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తెరిచి ఉన్న మ్యాన్హోల్స్ విషయంలో నిర్లక్ష్యం సహించబోమని అధికారులను హెచ్చరించారు. మ్యాన్హోల్ శుభ్రపరిచే పనుల కోసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!