

జమ్మూ కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలను అనుసంధానించే వ్యూహాత్మక ప్రాధాన్యమున్న జోజిలా సొరంగ మార్గం నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం 13.152 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం పురోగతిని ప్రారంభించనున్నారు. హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ మార్గం ఆసియాలోనే అత్యంత పొడవైన ఏక గొట్ట ద్విముఖ రహదారి సొరంగంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ సంస్థ సుమారు రూ.5,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.
2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు 2025 మార్చిలో పూర్తయ్యాయి. ఈ సొరంగ మార్గం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, లద్దాక్ మధ్య ఏడాదిలో 365 రోజులు నిరంతర రవాణా సౌకర్యం లభిస్తుంది. నిర్మాణ కాలంలో ఐదు భారీ తుఫానులు ఎదురైనా దాదాపు 1,200 మంది శ్రామికులు పనులను కొనసాగించారు. రహదారులు, వంతెనలతో కలిపి మొత్తం ప్రాజెక్టు పొడవు 30.894 కిలోమీటర్లు కాగా, భద్రత కోసం మూడు నిలువు గాలి ప్రసరణ మార్గాలను కూడా నిర్మించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!