

నటుడు రవితేజ తన కొత్త చిత్రం ఇరుముడిలో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తొలిసారిగా అయ్యప్ప భక్తుడి పాత్రను పోషిస్తున్న ఆయన నల్ల దుస్తులు, మాల, విభూతి, కుంకుమతో ఉన్న లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తండ్రి, కూతురు అనుబంధం చుట్టూ భావోద్వేగ కథతో రూపొందుతోంది.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్. అయ్యప్ప భక్తి గీతాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే వైరల్ అవుతున్న “బంగారు పల్లకి” పాటతో పాటు, శబరిమల యాత్ర, భక్తుల భావోద్వేగాలను ప్రతిబింబించే మరో పవర్ఫుల్ సాంగ్ కూడా ఉంటుందని సమాచారం.
భావోద్వేగం, భక్తి, సంగీతం కలిసిన ఈ ఇరుముడి చిత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇందులో తండ్రి, కూతురు పాటతో పాటు హీరోయిన్ భవానీ శంకర్తో రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో రవితేజ తన రెమ్యునరేషన్ను సుమారు 25 కోట్ల నుంచి 15 కోట్లకు తగ్గించినట్లు టాక్ వినిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!