

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో సాంకేతిక నిపుణుల పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,557 పోస్టులను భర్తీ చేయనుండగా, ఇందులో సాంకేతిక నిపుణుల గ్రేడ్-1 (సిగ్నల్) పోస్టులు 323, గ్రేడ్-3 పోస్టులు 6,234 ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 31, 2026 రాత్రి 11.59 గంటలలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
సాంకేతిక నిపుణుల గ్రేడ్-3 పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. గ్రేడ్-1 (సిగ్నల్) పోస్టులకు బీఎస్సీ లేదా సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా/డిగ్రీ అర్హత అవసరం. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన వారికి గ్రేడ్-1 పోస్టులకు నెలకు రూ.29,200, గ్రేడ్-3 పోస్టులకు రూ.19,900 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు అందిస్తారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!