

జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి, వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, టీకాల వివరాలను తెలుసుకుని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల వ్యాక్సిన్లను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన మూడు రోజుల పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ఐదేళ్లలోపు సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడిన సీఎం, పిల్లల పెంపకం బాధ్యత తల్లికే పరిమితం కాకూడదని అన్నారు. తండ్రులు, కుటుంబ సభ్యులు కూడా సమాన బాధ్యత వహించాలని సూచిస్తూ, పిల్లల సంరక్షణకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!