

మన శరీరంలో వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేసే కీలక అవయవం కాలేయం. దీని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో త్రిఫల (ఉసిరి, కారక్కాయ, తానికాయల మిశ్రమం)కు ప్రత్యేక స్థానం ఉంది. చేదు రుచిని తగ్గించేందుకు ఖర్జూరం, కొబ్బరి, నెయ్యి, సొంటి, యాలకులతో కలిపి లడ్డూలుగా తయారు చేయవచ్చు. ఖర్జూరాలను నానబెట్టి పేస్ట్ చేసి నెయ్యిలో వేయించి, త్రిఫల పొడి, సొంటి, యాలకులు, వేయించిన కొబ్బరి కలిపి చిన్న లడ్డూలుగా తయారు చేస్తారు.
ఈ లడ్డూలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. త్రిఫల దోషాలను సమతుల్యం చేస్తూ కాలేయం, పేగులను శుభ్రపరుస్తుంది. ఖర్జూరం శక్తిని అందిస్తే, నెయ్యి పోషకాలు శరీరానికి సులభంగా అందేలా చేస్తుంది. సొంటి, యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచి గ్యాస్ సమస్యలను తగ్గిస్తాయి. రోజూ ఒక లడ్డూ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!