
సినిమాలు

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణ్బీర్ కపూర్ ముంబైలోని 20 పాఠశాలల అభివృద్ధికి సహకరించేందుకు ముందుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఈ విషయాన్ని అలియా భట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు, అభ్యాసానికి అనువైన వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు.
ముంబైలో అభివృద్ధి చేయాల్సిన 20 పాఠశాలలను బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) సిఫారసుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన అభ్యాస ప్రదేశాలను అందించేలా పనులు చేపట్టనున్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!