

‘సయ్యారా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యువ నటి అనీత్ పడ్డా ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న ఆమె, ‘శక్తి శాలిని’ చిత్రంలో డబుల్ రోల్లో కనిపించనుండగా, ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. వరుస విజయాలతో ఆమెకు బాలీవుడ్లో డిమాండ్ మరింత పెరుగుతోంది.
ఇదిలా ఉండగా, భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్లో అనీత్ పడ్డా నటించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. స్మృతి మంధాన క్రికెట్ ప్రయాణం, ఆమె సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు మరియు భారత మహిళా క్రికెట్ అభివృద్ధికి చేసిన కృషిని ఈ చిత్రంలో చూపించే అవకాశముంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!