
బిజినెస్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా పార్టీకి రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత కారణాలతో ఆయన బీజేపీని వీడినట్లు సమాచారం. రాజీనామా అనంతరం తన ఎక్స్ ఖాతాలోని ‘జాతీయ అధికార ప్రతినిధి’ హోదాను తొలగించడంతో ఈ పరిణామం చర్చనీయాంశమైంది.
షెహజాద్ పూనావాలా తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించారు. 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల విధానాన్ని, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా విమర్శిస్తూ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా టీవీ చర్చల్లో పార్టీ తరఫున చురుకుగా వ్యవహరించారు. అయితే ఆయన బీజేపీకి రాజీనామా చేయడానికి గల అసలు కారణాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!