

ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలను 3.71 కోట్ల మంది ఓటర్లు సమర్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పరిశీలనలో భాగంగా 15.22 లక్షల మంది మరణించినట్లు గుర్తించగా, రెండు చోట్ల ఓటు నమోదు చేసుకున్న 7.37 లక్షల మంది పేర్లు గుర్తించినట్లు వెల్లడించారు.
ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఆగస్టు 30 వరకు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఉన్న కొత్త ఓటర్లు ఫామ్-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. నోటీసు, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును తొలగించబోమని సీఈవో స్పష్టం చేశారు. వచ్చే నెల 4న రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!