

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. కుటుంబ భావోద్వేగాలు, ఉత్కంఠభరిత అంశాల మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించి తాజాగా మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దాదాపు 20 ఏళ్ల తర్వాత వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్ర కోసం దివ్యేందు శర్మను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్రైమ్ ట్రాక్కు సంబంధించిన పాత్రలో ఆయన కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!