
సినిమాలు

‘వైల్డ్ డాగ్’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నటి దియా మీర్జా తాజాగా సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విధ్వంసానికి పితృస్వామ్య వ్యవస్థే కారణమని ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ప్రకృతి వనరులను మగవాళ్లు ప్రాపర్టీలా వినియోగిస్తున్నారని, అదే ప్రస్తుతం పర్యావరణ సంక్షోభానికి కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పెరిగిన దియా మీర్జా సినిమాల కంటే ఎక్కువగా ఇలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!