

ప్రస్తుతం స్టార్ హీరోలు కోట్ల రూపాయల పారితోషికాలు అందుకుంటున్న సమయంలో ప్రముఖ నటుడు దిల్జిత్ దోసాంజ్ కేవలం రూ.1 మాత్రమే తీసుకుని సినిమా చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ‘సత్లూజ్’ చిత్రానికి సంబంధించి దర్శకుడు హనీ ట్రెహాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పారితోషికం కంటే పాత్రకు ప్రాధాన్యత ఇచ్చిన దిల్జిత్ నిర్ణయంపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
మానవ హక్కుల ఉద్యమకారుడు జస్వంత్ సింగ్ ఖల్రా జీవితకథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో దిల్జిత్ ప్రధాన పాత్ర పోషించారు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్రకు డబ్బు తీసుకోవడం తనకు ఇష్టం లేదని ఆయన దర్శకుడికి చెప్పినట్లు హనీ ట్రెహాన్ తెలిపారు. అయితే ఒప్పంద నిబంధనల కోసం కేవలం రూ.1 పారితోషికంగా తీసుకున్నారని వెల్లడించారు. షూటింగ్ సమయంలోనూ దిల్జిత్ పూర్తి అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!