

హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన ‘దీవాన’ చిత్రం జూన్ 20న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంటోంది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో కూడిన కథ, ఇంటర్వెల్ ట్విస్ట్, ఆకట్టుకునే సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయని నిర్మాతలు తెలిపారు. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా సినిమా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయని వారు వెల్లడించారు.
సెన్సార్ సూచించిన మార్పులు చేసినప్పటికీ ‘ఏ’ సర్టిఫికేట్ రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడంలో ఇబ్బంది ఏర్పడిందని నిర్మాతలు పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి స్పందనతో చిత్ర భవిష్యత్తుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించేందుకు టికెట్ ధరలను కూడా తగ్గించినట్లు వెల్లడించారు. ‘దీవాన’ విజయంతో ఉత్సాహంగా ఉన్న నిర్మాతలు త్వరలో ఒక సూపర్ హీరో ఎంటర్టైనర్తో పాటు మరో ఆసక్తికరమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!