
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభ సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుండగా, రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ఆర్థిక పరిస్థితులు, ప్రజా సమస్యలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.
అదే రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశం ప్రారంభం కానుంది. శాసనసభ, మండలి సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రతిపక్షాలు కూడా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణపై అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!