
సినిమాలు

మియాపూర్లోని జీఎస్ఎం మాల్ సమీపంలో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిలో ఐస్క్రీమ్ బండి నడిపే ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో ఒక కాలేజీ విద్యార్థిని, ఒక ఐటీ ఉద్యోగిని మరియు మరొక వ్యక్తి ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!