

బాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందిన ‘కాక్టెయిల్ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. 2 గంటల 30 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రానికి జూన్ 14 అర్ధరాత్రి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మడాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యూత్ఫుల్ కంటెంట్, కొత్త జోడీ కారణంగా సినిమాపై అంచనాలు పెరిగాయి.
కృతి సనన్ కెరీర్లో ఇది తొలి ఏ సర్టిఫికెట్ సినిమా కాగా, రష్మిక మందన్నకు ‘యానిమల్’ తర్వాత రెండో ఏ రేటెడ్ చిత్రం. షాహిద్ కపూర్కు ఇది ఐదో ఏ సర్టిఫికెట్ మూవీగా నిలిచింది. 2012లో వచ్చిన ‘కాక్టెయిల్’ మొదటి భాగానికి యూఏ సర్టిఫికెట్ లభించగా, సీక్వెల్ కొంచెం ఎక్కువ నిడివితో రూపొందింది. ఈ నేపథ్యంలో ఏ సర్టిఫికెట్తో వస్తున్న ‘కాక్టెయిల్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!