

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘కే-ర్యాంప్’ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. సినిమా విడుదలై కొంతకాలం గడిచినప్పటికీ, నాని తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఆయన ఇద్దరు క్రేజీ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, నాగ చైతన్య కోసం ఇప్పటికే ఓ కథ సిద్ధం చేసిన జైన్స్ నాని త్వరలోనే ఆయనకు కథ వినిపించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నితిన్కు కూడా ఓ కథ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తన తదుపరి సినిమాను నాగ చైతన్యతో చేస్తారా, నితిన్తో చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. ‘కే-ర్యాంప్’ విజయానంతరం నాని తదుపరి ప్రాజెక్ట్పై అంచనాలు పెరుగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!