

‘బేబీ’ చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ తెరకెక్కింది. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ రొమాంటిక్, యూత్ఫుల్ ఎంటర్టైనర్ను రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 11న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్కు ముందు తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు అనూహ్యంగా ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే 18 ఏళ్లకు పైబడిన వారికే థియేటర్లలో సినిమా వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికెట్ పోస్టర్ను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకోగా, క్షణాల్లో వైరల్గా మారింది. కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్, ‘బేబీ’తో క్రేజ్ తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జోడీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఎలాంటి సర్టిఫికెట్ వస్తుందనే ఆసక్తి నెలకొంది. ఊహించని విధంగా ‘A’ సర్టిఫికెట్ రావడంతో ‘ఎపిక్’పై క్యూరియాసిటీ మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!