

మాస్ మహారాజ రవితేజ హీరోగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజ్ కేవలం ఆన్లైన్ బుకింగ్స్కే పరిమితం కాకుండా థియేటర్ల వద్ద కూడా కనిపిస్తోందని తాజా ఘటనతో స్పష్టమవుతోంది.
తెలంగాణలోని ముక్తల్ ప్రాంతంలోని వెంకట రమణ సింగిల్ స్క్రీన్లో ఇరుముడి విజయవంతంగా ప్రదర్శితమవుతున్నట్లు సమాచారం. టికెట్లు దొరకక పలువురు ప్రేక్షకులు తిరిగి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అయితే బుధవారం నుంచి ఇరుముడి స్థానంలో మరో సినిమాను ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యం సిద్ధమవడంతో, ఇరుముడి చూడటానికి వచ్చిన ప్రేక్షకులు షో వేయాల్సిందే అంటూ థియేటర్ వద్ద పట్టుబట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా సాధించిన క్రేజ్కు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తోందని అభిమానులు చెబుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!