

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా చిరంజీవి మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేసేందుకు చిరంజీవి నాలుగు రోజుల సమయం కేటాయించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో పెండింగ్లో ఉన్న రీషూట్ భాగాలను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ వ్యయాన్ని త్వరగా రాబట్టుకునేందుకు నాన్-థియేట్రికల్ హక్కుల డీల్స్ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!