
జనరల్

నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో భారీగా సంభవించిన ఆకస్మిక వరదలు కైలాస మానస సరోవర్ యాత్రపై ప్రభావం చూపాయి. జలప్రళయం కారణంగా మానస సరోవరం వైపు వెళ్లే రహదారులు దెబ్బతినడంతో పాటు కొన్ని మార్గాలు పూర్తిగా మూసుకుపోయినట్లు సమాచారం. దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఆగస్టు 27 నుంచి నేపాల్ మీదుగా ఖాట్మాండ్ నుంచి ప్రారంభం కావాల్సిన మానస సరోవర్ యాత్రను ప్రస్తుత పరిస్థితుల్లో నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. మార్గాలు మరో నెల రోజుల పాటు మూసి ఉండే అవకాశం ఉందని నేపాల్-టిబెట్ సరిహద్దు అధికారులు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకు పర్యాటకులు, యాత్రికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. రహదారి మార్గాలు పునరుద్ధరించిన తర్వాత యాత్ర పునఃప్రారంభంపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!