

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టించబోతోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ముంబైలో నిర్వహించిన ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్తో కలిసి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్మేకర్లు, బిజినెస్ మైండ్స్ను ఈ కార్యక్రమంలో సత్కరించారు.
దేశంలో డైరీ విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో ప్రత్యేకత సాధించిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డును అందజేశారు. అనంతరం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్పీఎస్జీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ ప్రధాన కారణాలని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!