
సినిమాలు

‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు చిదంబరం, మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ తో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలపై స్పందించారు. ఇటీవల ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, అలాంటి ప్రాజెక్ట్పై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని చిదంబరం స్పష్టం చేశారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తన తండ్రి ఎక్కడో విన్న సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఉండవచ్చని చెప్పారు. సాధారణ సందర్భాల్లో మోహన్లాల్ను కలిసినప్పటికీ, సినిమా ప్రాజెక్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని వివరించారు. భవిష్యత్తులో అవకాశం వస్తే మోహన్లాల్తో ప్రేక్షకులు ఆశించే స్థాయిలో వినోదాత్మక చిత్రాన్ని రూపొందించాలని ఉందని తెలిపారు. ప్రస్తుతం చిదంబరం తన తదుపరి చిత్రం బాలన్ విడుదలకు సిద్ధమవుతున్నారు













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!