
జనరల్

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ టీమ్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు బుచ్చిబాబుపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన చిరు, టీమ్ అందించిన కృషిని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను పెద్ది టీమ్ సోషల్ మీడియాలో పంచుకుంది.
రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా జూన్ 4న విడుదలై ఇప్పటివరకు రూ.345 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, జగపతిబాబు, శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండటంతో అభిమానుల్లో జోష్ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!