

వెబ్ సిరీస్గా సంచలనం సృష్టించిన మీర్జాపూర్ ఇప్పుడు థియేటర్లలోనూ వసూళ్ల మోత మోగిస్తోంది. సెప్టెంబర్ 4న విడుదలైన మీర్జాపూర్: ది మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లను నమోదు చేస్తోంది. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ను దాటినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. సెప్టెంబర్ 10తో మొదటి వారం పూర్తయ్యేసరికి ఇండియాలో 148.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఇండియా గ్రాస్ సుమారు 176.94 కోట్లుగా ఉండగా, ఓవర్సీస్ నుంచి 35.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ 212.44 కోట్లకు చేరుకుంది. అంటే విడుదలైన 7వ రోజుకే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. ఈ వసూళ్లతో 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో మీర్జాపూర్: ది మూవీ కూడా చోటు సంపాదించుకున్నట్లు సమాచారం. సినిమా ఇంకా అదే వేగాన్ని కొనసాగిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!