

ప్రియదర్శి కథానాయకుడిగా, తెలంగాణ జానపద పాటలతో గుర్తింపు పొందిన నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాగితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ తెలంగాణ కుటుంబ నేపథ్య వినోదాత్మక చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట ‘శ్రీలత’ను చిత్రబృందం విడుదల చేసింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ పాటను మెలోడీగా తీర్చిదిద్దారు.
సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకు అలరాజు సాహిత్యం అందించారు. శంకర్బాబు, మోహన భోగరాజు తమ గాత్రంతో పాటకు మరింత హృద్యమైన అనుభూతిని అందించారు. ప్రస్తుతం ‘ఇడుపు కాగితం’ చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తెలంగాణ కుటుంబ జీవనశైలిని ప్రతిబింబించే అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రియదర్శి, నాగదుర్గ కాంబినేషన్తో పాటు తెలంగాణ నేపథ్యం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!