

టాలీవుడ్లో యాక్షన్ సినిమాల తీరు క్రమంగా మారుతోంది. గతంలో వినోదం, ప్రేమకథలకు పెద్దపీట వేసిన హీరోలు ఇప్పుడు రా అండ్ రస్టిక్ టచ్తో కూడిన వైలెంట్ కథలను ఎంచుకుంటున్నారు. ప్రేక్షకులు కూడా బలమైన భావోద్వేగాలతో పాటు భారీ యాక్షన్, రక్తపాతంతో కూడిన డ్రామాను ఆదరిస్తుండటంతో యంగ్ హీరోలు తమ ఇమేజ్కు భిన్నమైన పాత్రల్లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ, నాని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ వంటి హీరోలు ముందున్నారు. విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబాలి బ్రిటిష్ పీరియాడిక్ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో విజయ్ ఉగ్రమైన పాత్రలో కనిపించనున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఘర్షణలు, పోరాటాలు, రక్తపాతంతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
నాని ఇప్పటికే దసరాతో ఊరమాస్, వైలెంట్ అవతారాన్ని చూపించారు. ఇప్పుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ది పారడైజ్ చేస్తున్నారు. పూర్తి స్థాయి వైలెన్స్, భావోద్వేగాలతో సాగే ఈ కథలో రస్టిక్ యాక్షన్ కీలకంగా ఉండనుంది. సాయి ధరమ్ తేజ్ కూడా రోహిత్ కెపి దర్శకత్వంలోని సంబరాల ఏటిగట్టుతో వైలెంట్ జానర్లోకి వస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో పగ, ప్రతీకారాల చుట్టూ సాగే ఈ కథలో యాక్షన్ ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న భోగీ కూడా రక్తపాతంతో కూడిన మాస్ యాక్షన్ కథగా రూపొందుతోంది. ఇందులో శర్వా ఇప్పటివరకు చూడని వైలెంట్ అవతారంలో కనిపించనున్నారని సమాచారం. మరి ఈ కొత్త ప్రయోగాలు హీరోలకు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!