

తెలుగు, బాలీవుడ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ తన భవిష్యత్ కెరీర్ ఆకాంక్షలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పూర్తి స్థాయి, హృదయాలను హత్తుకునే ఇంటెన్స్ లవ్ స్టోరీలో నటించలేదని, అలాంటి ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాలో నటించాలని ఉందని తెలిపారు. అలాగే పీరియడ్ డ్రామాలు, హర్రర్ చిత్రాల్లోనూ ఇప్పటివరకు భాగం కాలేదని, ఆ జానర్లలో విభిన్నమైన ప్రయోగాలు చేయాలని ఉందన్నారు. గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా, నటిగా తన సామర్థ్యాన్ని సవాల్ చేసే కథలను ఎంచుకోవడమే ఇకపై తన ప్రాధాన్యత అని రకుల్ స్పష్టం చేశారు.
సినిమా విషయంలో పెద్ద బ్యానర్ లేదా జానర్ కంటే, తాను పోషించే పాత్రకు ఉన్న ప్రాధాన్యతకే ఎక్కువ విలువ ఇస్తానని రకుల్ తెలిపారు. కేవలం తెరపై కనిపించడం మాత్రమే కాకుండా, నటిగా తనను మానసికంగా, సృజనాత్మకంగా ఉత్తేజపరిచే పాత్రలను అంగీకరిస్తానన్నారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణం’లో రకుల్ శూర్పణఖ పాత్రలో కనిపించనున్నారు. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!