

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమిళ సినీ పరిశ్రమలో తమ నిర్మాణాలను మరింత విస్తరిస్తూ మరో కొత్త ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించింది. యువ నటుడు ధృవ్ విక్రమ్ కథానాయకుడిగా, దర్శకుడు కరణ్ అరవింద్ కుమార్ తెరకెక్కించనున్న కమర్షియల్ ఎంటర్టైనర్కు చెన్నైలో పూజా కార్యక్రమంతో శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ధృవ్ విక్రమ్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. స్క్రీన్ప్లేను సబీ అందిస్తుండగా, ఛాయాగ్రహణాన్ని విక్కీ, ఎడిటింగ్ను జయసూర్య, యాక్షన్ కొరియోగ్రఫీని విక్రమ్ మోర్ నిర్వహిస్తున్నారు. తమిళంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న నాలుగో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్పై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!