

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మేకర్స్ ‘కల్కి 2’ పనుల్లో బిజీగా ఉండగా, తొలి భాగంలోని కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది.
ముఖ్యంగా సినిమాలో కర్ణుడి పాత్ర చిత్రీకరణ, క్లైమాక్స్ ఎపిసోడ్పై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అఖిల్ నటించిన ‘లెనిన్’ విడుదల అనంతరం వైరల్ అయిన ఓ పోస్టులో, కర్ణుడి పాత్రను అతిగా చూపించారని, క్లైమాక్స్పై కూడా విమర్శలు చేశారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఈ విమర్శలకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్స్ వేదికగా సమాధానం ఇచ్చారు. మహాభారతంలోని ద్రోణ పర్వంకు సంబంధించిన ఆధారాలను పంచుకుంటూ, శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడి పరాక్రమాన్ని ప్రశంసించిన సందర్భాలను గుర్తు చేశారు. విమర్శలు చేసే ముందు మహాభారతాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించిన ఆయన, భారతీయ ఇతిహాసాలపై తనకు అపారమైన గౌరవం ఉందని, పూర్తి అవగాహనతోనే ఈ చిత్రాన్ని రూపొందించానని స్పష్టం చేశారు. చివరగా "కల్కి పార్ట్ 2 కోసం వేచి ఉండండి" అంటూ ఆసక్తి పెంచారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!