
జనరల్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ చిత్రం 'గాడ్ ఆఫ్ వార్' మరోసారి వార్తల్లో నిలిచింది. ధనుష్-వెట్రిమారన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'తమిళ్ మురుగన్' కూడా సుబ్రహ్మణ్య స్వామి కథాంశంతోనే రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో త్రివిక్రమ్ తన స్క్రిప్ట్పై మళ్లీ దృష్టి సారించినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సుబ్రహ్మణ్య స్వామి దైవత్వాన్ని మరింత బలంగా ఆవిష్కరించేలా, కథను ప్రత్యేకంగా తీర్చిదిద్దే దిశగా స్క్రిప్ట్లో మార్పులు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇప్పటికే మంచి అంచనాలను సొంతం చేసుకోగా, నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!