
జనరల్

జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న 'శ్రీనివాస మంగాపురం' చిత్రంలో రషా థడానీ కథానాయికగా నటిస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై జెమిని కిరణ్ నిర్మించగా, అశ్వినీ దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. జూలై 30న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను చిత్రబృందం ఇటీవల ఘనంగా విడుదల చేసింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరుకానున్నట్లు జయకృష్ణ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండగా, విడుదలకు ముందే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!