

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తాత, తండ్రి పాత్రలతో పాటు ఇద్దరు కుమారుల పాత్రలను కూడా ఆయన పోషించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
సమాచారం ప్రకారం, మాఫియా నేపథ్యంతో ఓ డాన్ జీవితాన్ని కేంద్రంగా చేసుకుని ఈ కథ తెరకెక్కనుంది. దీపికా పడుకోణె కీలక పాత్రలో నటిస్తుండగా, దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా పవర్ఫుల్ కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కథలో కీలక మలుపులు తీసుకువచ్చే ప్రత్యేక అతిథి పాత్రలు కూడా ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతుండగా, 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!