

వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్పై సాయి అభిషేక్ నిర్మాణంలో, దర్శకుడు గొండి మణితేజ తెరకెక్కిస్తున్న ‘ఓరి నాయనో’ (Tagline: Every Life Will Have an Ori Nayano! Moment) చిత్రం టైటిల్ను హీరో నవీన్ చంద్ర హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ‘మా ఊరి పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, రాజా రవీంద్ర, ఛాయాగ్రాహకుడు వెట్రి పళనిస్వామితో పాటు చిత్రబృంద సభ్యులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడుతూ, ప్రేక్షకుల హృదయాలను తాకే కథను వినోదం, భావోద్వేగాలతో మేళవించి రూపొందిస్తున్నామని తెలిపారు. నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ, ఉన్నత నిర్మాణ విలువలు, ప్రతిభావంతమైన సాంకేతిక బృందంతో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, విభిన్న కథలకు ప్రాధాన్యం ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. అనూహ్య మలుపులు, నేటి సమాజాన్ని ప్రతిబింబించే పాత్రలతో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతుండగా, ప్రధాన తారాగణం వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ‘ఓరి నాయనో’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!