

37 సంవత్సరాల పాటు భారత సైన్యంలో సేవలందించిన కల్నల్ దివ్య ఠాకూర్, పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని ఎంచుకోకుండా మరో రూపంలో దేశసేవ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. నాలుగో తరం సైనిక అధికారి అయిన ఆయన, "సేవియర్ ఆఫ్ కాశ్మీర్"గా పేరొందిన బ్రిగేడియర్ రాజీందర్ సింగ్ మనవడు. 2019లో రిటైర్ అయిన అనంతరం కరోనా మహమ్మారి సమయంలో మణాలి సమీపంలోని తన స్వగ్రామానికి చేరుకుని, కుటుంబానికి చెందిన పాత ఆపిల్ తోటను పునరుద్ధరించాలని సంకల్పించారు. వ్యవసాయంలో అనుభవం లేకపోయినా, ఏడాది పాటు ఆపిల్ సాగుపై శాస్త్రీయ పద్ధతులను నేర్చుకుని తర్వాతే సాగు ప్రారంభించారు.
సేంద్రీయ వ్యవసాయం పేరుతో జరుగుతున్న దుర్వినియోగాన్ని గమనించిన ఆయన, నిజమైన ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. "దేశసేవ అంటే కేవలం సరిహద్దులను కాపాడటమే కాదు, నేలను, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం కూడా అదే సేవ" అని ఆయన పేర్కొన్నారు. సైనికుడి నుంచి సేంద్రియ రైతుగా మారిన ఆయన ప్రయాణం సమాజానికి స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!