
జనరల్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓటరు జాబితాపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో పేరు లేని వారు తన దృష్టిలో "చనిపోయినట్టే" అని వ్యాఖ్యానించిన ఆయన, అలాంటి వారికి పెన్షన్లు లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎందుకు కల్పించాలని ప్రశ్నించారు. ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు అయ్యాయో లేదో పరిశీలించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే, ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఆసక్తి చూపని వారు సమాజం గురించి మాట్లాడే ముందు తమ బాధ్యతను గుర్తించుకోవాలని ఆయన అన్నారు. అయ్యన్నపాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!