
క్రీడలు

బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఆయన సతీమణి శోభమ్మ తమ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షుకు 21వ జన్మదిన సందర్భంగా ఆశీర్వాదాలు అందించారు. ఆయురారోగ్యాలతో చిరకాలం సుఖసంతోషాలతో జీవించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మనవడికి శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారం ఉదయం నార్సింగిలోని కేటీఆర్ నివాసంలో హిమాన్షు జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కేసీఆర్ స్వయంగా హిమాన్షుకు పుట్టినరోజు కేక్ తినిపించి ఆశీర్వదించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో వేడుకలు నిర్వహించబడినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!