
జనరల్

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను గ్లామరైజ్గా చూపించడంపై వస్తున్న వివాదంపై నిత్యా మీనన్ స్పందించారు. తాను ఇంకా సినిమా చూడలేదని చెప్తూనే, తెరపై మహిళలను వస్తువులా చూపించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం సౌత్ సినిమాల సమస్య కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని ఆమె అన్నారు.
సినిమాలను ఎక్కువగా కమర్షియల్గా తీసే ధోరణి వల్లే ఇలాంటి సన్నివేశాలు వస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. నటీనటులు కెరీర్ ప్రారంభం నుంచే తమ హద్దులను స్పష్టంగా పెట్టుకోవాలని సూచించారు. ఇష్టం లేని పాత్రలను తిరస్కరించే ధైర్యం ఉండాలని, లేకపోతే తర్వాత పరిశ్రమలో సీరియస్గా తీసుకోరని నిత్యా మీనన్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!