
సినిమాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూలై 18న తారక్ కీలక రాజకీయ ప్రకటన చేయనున్నారంటూ పలు పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంపై స్పందించిన ఎన్టీఆర్ అధికారిక బృందం, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
జూలై 18న నిర్వహించనున్న 'మా ఊరు వాడ' కార్యక్రమం పూర్తిగా ముందస్తు ప్రణాళికలో భాగమేనని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ తెలిపింది. నిర్ధారణ కాని వార్తలను ప్రచారం చేయవద్దని మీడియా, సోషల్ మీడియా వేదికలను కోరింది. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడిస్తామని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!