
జనరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతూ మంచి వసూళ్లను నమోదు చేస్తోంది. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణతో చిత్రబృందం మెగా బ్లాక్బస్టర్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ విజయోత్సవానికి సంబంధించిన తేదీ, వేదికను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

జూన్ 23న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలో చిత్రబృందంతో పాటు ప్రత్యేక అతిథులు కూడా పాల్గొనే అవకాశముందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!