

ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా వరుస విజయాలతో దూసుకెళ్లిన పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. తెలుగు చిత్రాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత బాలీవుడ్లో తన స్థానం బలపర్చుకోవాలని ప్రయత్నించిన ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు. తాజాగా విడుదలైన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రం ఆమె కెరీర్కు కీలక మలుపు తీసుకువస్తుందని సినీ వర్గాలు భావించాయి.
అయితే విడుదల అనంతరం ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లభించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభ వసూళ్లు కూడా నిరాశాజనకంగా ఉండటంతో సినిమా భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటించిన మృణాల్ ఠాకూర్కు కూడా ఇది కీలక ప్రాజెక్ట్గా నిలిచింది. కానీ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ఇద్దరు హీరోయిన్ల కెరీర్లపై దీని ప్రభావం ఉండొచ్చనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం వారి దృష్టి రాబోయే ప్రాజెక్టులపైనే కేంద్రీకృతమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!