

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణాష్టమి వేడుకలను సంప్రదాయబద్ధంగా, ఎంతో ఆనందంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పిల్లలను శ్రీకృష్ణుడు, రాధారాణి రూపాల్లో ముస్తాబు చేసి ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన క్యూట్ ఫొటోలను ఉపాసన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. కొణిదెల ఇంట్లోకి చిన్న కృష్ణుడు అడుగుపెట్టాడని, దీంతో తన కల నెరవేరిందంటూ ఆమె చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్గా మారింది.
ఈ ఫొటోలకు మెగా అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొందరు అభిమానులు కవల పిల్లల ముఖాలను చూడాలని కోరుకుంటుండగా, రామ్ చరణ్, ఉపాసన మాత్రం పిల్లల ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. 2023 జూన్ 20న క్లీంకార జన్మించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో దంపతులకు కవలలు జన్మించారు. కవలలకు శివరామ్, అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. చిన్నారుల ముఖాలను ఎప్పుడు అభిమానులకు పరిచయం చేస్తారనే ఆసక్తి కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!